ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్..  రోజూ ఓ గ్లాస్ తాగితే...

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. బరువు నియంత్రించుకోవడానికి సహాయ పడే ఒక సహజ మార్గం ద్రాక్ష నీరు.

150 గ్రాముల ద్రాక్షను రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత అదే నీటిలో రాత్రంతా నానబెట్టాలి.

ఉదయం ఆ నీటిని వడకట్టి కొద్దిగా వేడి చేయాలి. ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి.

రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఈ నీటిని తాగిన తర్వాత అరగంట పాటు ఏమీ తినకూడదు.

 ఖాళీ కడుపుతో ద్రాక్ష నీరు తాగితే కాలేయంలో ఉన్న టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. రక్తం శుభ్రంగా మారుతుంది.

నానబెట్టిన ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ద్రాక్ష నీరు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీరంలో కొవ్వు స్థాయి కూడా తగ్గుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.