నీటిలో ఈ పదార్థాన్ని  కలిపి స్నానం చేయడం వల్ల   ఎన్నో సమస్యలు దూరం..

చాలా మంది స్నానం అంటే చల్లటి లేదా వేడి నీటితో చకచకా స్నానం చేసేస్తుంటారు. 

అయితే.. ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు నీటిలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంలోని బ్యాక్టీరియాను ఎదుర్కోవడంలో సాయం చేస్తాయి.

ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం ఎక్కువ ఖనిజాలను గ్రహిస్తుంది. అలాగే శరీరంలో మెగ్నీషియం స్థాయి పెరుగుతుంది.

జిమ్‌లో వ్యాయామం చేసే వారు ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల బిగుతుగా ఉన్న కండరాలను సడలింపజేసి, నొప్పులను తగ్గిస్తుంది.

మీ పాదాలు నొప్పిగా అనిపించినా, అసలిపోయినట్లుగా ఉన్నా కూడా ఉప్పు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, దురద, గోరు ఫంగస్ తగ్గిపోతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి.