200 ఏళ్లు బతకొచ్చు..
బాబా రాందేవ్ కామెంట్స్ వైరల్!
మనిషి ఆయువు వందేళ్లు అని అంటుంటారు. అయితే ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మాత్రం అంతకంటే ఎక్కువ కాలమే బతకొచ్చునని చెబుతున్నారు.
దాదాపు 150 నుంచి 200 ఏళ్ల వరకు మనుషులు బతకొచ్చని రాందేవ్ అన్నారు.
ఉరుకుల పరుగుల జీవితంలో మెదడు, గుండె, కళ్లు, కాలేయం మీద ఎక్కువ ఒత్తిడి పెంచుతున్నామని చెప్పారు.
100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని 25 ఏళ్లలో తింటున్నామని బాబా రాందేవ్ పేర్కొన్నారు.
ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి అవసరమని సూచించారు.
మానవ శరీరంలో ప్రతీ కణానికి సహజమైన జీవితకాలం ఉంటుందని రాందేవ్ చెప్పుకొచ్చారు.
150 నుంచి 200 సంవత్సరాలు వరకు బతకొచ్చు అంటూ బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Related Web Stories
వర్షాకాలంలో ఈ పండు తింటే ఎన్ని లాభాలో..
బీ-కేర్ఫుల్.. వీరు లవంగం అస్సలు తినకూడదు..!
ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా..
పచ్చి బొప్పాయి తింటే ఈ వ్యాధులన్నీ పరార్..