పండ్లు ఆరోగ్యానికి మంచివే..  కానీ పొరపాటున రాత్రి సమయంలో  వీటిని తింటే..

రాత్రిపూట పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుందని అనుకుంటారు. 

కానీ కొన్ని రకాల పండ్లు రాత్రి తినడం వల్ల ఎసిడిటి, జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

అరటిపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దీన్ని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.

 రాత్రి సమయంలో దానిమ్మ తినడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.

అత్తిపండు రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

 రాత్రి సమయంలో ద్రాక్ష లేదా నారింజ పండ్లు తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది.

రాత్రి సమయంలో జామపండు తింటే కడుపు భారంగా మారి రాత్రంతా జీర్ణక్రియ మీద భారం పడుతుంది.