ఎండు చేపలు తింటున్నారా..? ఎవరు తినకూడదో మీకు తెలుసా..?

గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తినకూడదు.

ఎండు చేపల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచే అవకాశముంది.

షుగర్ ఉన్నవారు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు మారిపోవచ్చు.

 దద్దుర్లు, పొక్కులు, దురద వంటి సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని వారు ఎండు చేపలు తినడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.

 జలుబు, దగ్గు, సైనస్, ఆస్తమా సమస్యలు ఉన్నవారు ఎండు చేపలు తినకూడదు.

 ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.