ఖర్జూరాన్ని పాలతో కలిపి తాగితే  ఈ సమస్యలన్నీ దూరం..

నిద్రపోయే ముందు గ్లాసు పాలు తీసుకోవడం చాలా మందికి అలవాటు. కానీ, ఇందులో ఖర్జూరాన్ని కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి పోషకాలు అందుతాయి.

నానబెట్టడం వల్ల ఖర్జూరంలోని విటమిన్లు, మినరల్స్ మరింత చురుగ్గా మారతాయి.

పాలలో ఖర్జూరాన్ని కలిపితే కీళ్ళ నొప్పులు తగ్గి ఎముకల సాంద్రత పెరుగుతుంది. అదే విధంగా బలం పెరుగుతుంది.  

ఖర్జూరంతో కలిసిన పాలు తాగడం వల్ల చర్మంపై మంట, చికాకు వంటి సమస్యలు తగ్గుతాయి.

 పాలలో ఖర్జూరం కలిపి తాగితే రక్త ప్రసరణ పెరిగి మీ ముఖం సహజంగానే మెరుస్తుంది.

 పాలు, ఖర్జూరం రెండింటిలోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కండరాల బలం పెరుగుతుంది.