నిర్మలా సీతారామన్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటారు 

ప్రతి ఏటా బడ్జెట్ రోజున నిర్మల సీతారామన్ ప్రత్యేకంగా రూపొందించిన చీరను ధరిస్తారు.

ఈ ఏడాది కూడా బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చేనేత చీరను నిర్మలా సీతారామన్ ధరించారు.

సాధారణంగా బడ్జెట్ వేళ చేనేత చీరలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు నిర్మల సీతారామన్

ఈసారి ధరించిన చీరలో ఒక ప్రత్యకత ఉంది

బీహార్ రాష్ట్రం మధుబని కళకు చెందిన చిత్రాలు కనిపిస్తున్నాయి.

అవుట్‌రీచ్ యాక్టివిటీ కోసం కేంద్రమంత్రి ఓసారి మధుబనీకి వెళ్లారు

పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఈ చీరను నిర్మలకు 2021లో బహుమతిగా ఇచ్చారు.

ఆ చీరనే నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధరించారు