ఓలా, ఉబర్‌కు కేంద్రం షాక్..  ఎలా వసూలు చేస్తారంటూ..

యాప్ ఆధారంగా క్యాబ్, ఆటో, బైక్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబర్ సంస్థలకు షాక్ తగిలింది. 

ఓలా, ఉబర్‌కు కేంద్ర సర్కారు నోటీసులు జారీ చేసింది. 

ఓలా, ఉబర్ మీద ఇటీవల కాలంలో కంప్లయింట్స్ ఎక్కువయ్యాయి. 

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్లను బట్టి ఓలా, ఉబర్ రైడ్ చార్జీల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

రైడ్ స్టార్టింగ్‌లో ఒక రేట్, ముగిశాక మరో రేట్ చూపించడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. 

ఈ ఆరోపణపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఓలా, ఉబర్‌ను ఆదేశించింది. 

ఒకే సర్వీసుకు వేర్వేరు ధరలు విధించడం మీదా కేంద్రం సీరియస్ అయింది. 

ఈ రెండు విషయాలపై వివరణ ఇవ్వాలని.. సర్వీసులు, చార్జీల విషయంలో పారదర్శకత తీసుకురావాలని సర్కారు స్పష్టం చేసింది.