కొత్త సంవత్సరం వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పారింది. 

మద్యం అమ్మకాలు ముందెన్నడూ లేని విధంగా జోరందుకున్నాయి. 

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 

తెలంగాణలో గత రెండు రోజుల్లో ఏకంగా 750 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. 

ఒక్క డిసెంబర్ నెలలోనే భారీగా 5 వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 

ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఇదే మొదటి సారి కావటం గమనార్హం. 

ఇక, ఏపీలో ఒక్కరోజులోనే ఏకంగా 172 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 60 కోట్ల రూపాయల మేర ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి.