Viral: యువతిని చూసి పారిపోయిన యువకుడు.. వెంటబడి మరీ పట్టుకున్న యువతి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-08-30T23:35:28+05:30 IST

వారిద్దరికి మూడు నెలల క్రితమే పెళ్లి నిశ్చయమైంది.. వధువు కుటుంబం వరుడికి బైక్‌తో పాటు రూ.50 వేలను కట్నంగా ఇచ్చింది.

Viral: యువతిని చూసి పారిపోయిన యువకుడు.. వెంటబడి మరీ పట్టుకున్న యువతి ఏం చేసిందంటే..

వారిద్దరికీ మూడు నెలల క్రితమే పెళ్లి నిశ్చయమైంది.. వధువు కుటుంబం వరుడికి బైక్‌తో పాటు రూ.50 వేలను కట్నంగా ఇచ్చింది.. అయితే పెళ్లి తేదీ దగ్గరపడినప్పుడల్లా వరుడు పెళ్లి వాయిదా వేస్తున్నాడు.. అలా ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేశాడు.. చివరకు పూర్తిగా వధువు కుటుంబానికి కనబడకుండా పోయాడు.. తాజాగా ఆ యువకుడిని మార్కెట్‌లో ఆ యువతి చూసింది.. వరుడిని పట్టుకుని తనను పెళ్లి చేసుకోమని అడిగింది. అక్కడ వారిద్దరి మధ్య పెద్ద హైడ్రామా నడిచింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: సెక్యూరిటీ గార్డులపై దాడి.. సహాయం చేసినందుకు చెంప దెబ్బలు.. చివరకు ఏం జరిగిందంటే..


బీహార్‌ (Bihar)లోని నవాడాలోని మెహకర్ గ్రామానికి చెందిన అబ్బాయికి, మహులి గ్రామానికి చెందిన అమ్మాయికి మూడు నెలల క్రితం పెళ్లి కుదిరింది. యువతి కుటుంబ సభ్యులు వరుడికి బైక్‌తో పాటు రూ.50 వేలను కట్నంగా ఇచ్చారు. అయితే కట్నం తీసుకున్న యువకుడు పెళ్లికి మాత్రం మొహం చాటేస్తున్నాడు. పెళ్లి తేదీ దగ్గరపడుతున్నప్పుడల్లా పెళ్లి వాయిదా వేస్తున్నాడు. అలా మూడుసార్లు పెళ్లిని వాయిదా వేశాడు. చివరకు వధువు కుటుంబానికి కనిపించకుండా తిరుగుతున్నాడు. తాజాగా ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి భగత్ సింగ్ చౌక్ మార్కెట్‌కు వెళ్లింది. 




అక్కడ ఆమెకు ఆ యువకుడు కనిపించాడు. వెంటనే అతడిని పట్టుకుని తనను పెళ్లి చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఆమె నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో ఆ యువతి ఆ యువకుడిని ఛేజ్ చేసి మరీ పట్టుకుంది. `నన్ను పెళ్లి చేసుకో` అని పట్టుబట్టింది. యువకుడు పారిపోకుండా గట్టి పట్టు పట్టింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఓ గుడిలో ఆ యువతీయువకులు పెళ్లి చేసుకున్నారు. 

Updated Date - 2022-08-30T23:35:28+05:30 IST