Live in relationship: సహజీవనం చేసేలా అగ్రిమెంట్ చేసుకున్న వ్యాపారి.. నాలుగు నెలల తర్వాత.. సడన్గా ఊహించని పరిణామం..
ABN , First Publish Date - 2022-08-05T22:22:25+05:30 IST
ఆమె భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యాపారి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. సహజీవనం చేయాలని...
ఆమె భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యాపారి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి అగ్రిమెంట్ (Agreement) చేసుకుని కలిసి జీవించడం మొదలెట్టారు. నాలుగు నెలలు సంతోషంగానే ఉన్నారు. అయితే తర్వాత వారి మధ్య సమస్య తలెత్తింది. వ్యాపారి చేసిన నిర్వాకం.. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం జైపూర్ (Jaipur) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హథోజ్ కర్ధాని ప్రాంతానికి చెందిన 30ఏళ్ల మహిళ.. భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఇలావుండగా 2022 ఏప్రిల్లో ఆమెకు అయూబ్ఖాన్ అనే వ్యాపారి పరిచయమయ్యాడు. ఇద్దరి అభిప్రాయాలు నచ్చడంతో వారి మధ్య చనువు పెరిగింది. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు ఇద్దరం సహజీవనం చేద్దామని వ్యాపారి తెలిపాడు. పిల్లల సంరక్షణ కోసం ఆమె కూడా ఇందుకు ఒప్పుకొంది. దీంతో ఇద్దరూ అగ్రిమెంట్ చేసుకుని, కలిసి జీవించడం మొదలెట్టారు. అనంతరం ఇద్దరూ కలిసి వ్యాపారం (business) కూడా చేసేవారు.
Instagram friendship: ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచిన పైలట్.. ఏకంగా 30మంది మహిళలతో.. చివరకు తెలిసింది ఏంటంటే..
ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అలాగే పలుమార్లు ఆమెకు డబ్బులు అప్పుగా కూడా ఇచ్చేవాడు. ఇలావుండగా, ఇటీవల అతను సొంతూరికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. మహిళ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో చివరకు మోసపోయానని తెలుసుకున్న ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.