వైరల్ అవుతున్న ఇద్దరు రైల్వే ఉద్యోగుల సెల్ఫీ.. దాని ప్రత్యేకత ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-16T22:46:48+05:30 IST

పై ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వేర్వేరు రైళ్లలో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు తీసుకున్న సెల్ఫీ ఫొటో అది.

వైరల్ అవుతున్న ఇద్దరు రైల్వే ఉద్యోగుల సెల్ఫీ.. దాని ప్రత్యేకత ఏంటో తెలిస్తే..

పై ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వేర్వేరు రైళ్లలో ఉన్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు తీసుకున్న సెల్ఫీ ఫొటో అది. దానిలో ప్రత్యేకత ఏంటంటే.. వారిద్దరూ తండ్రీకొడుకులు.. తండ్రి ఎప్పట్నుంచో రైల్వే గార్డుగా పని చేస్తున్నాడు.. అతని కొడుకు ఇటీవల ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా ఉద్యోగం సాధించాడు. ఇద్దరూ డ్యూటీలో ఉండగా ఒకే రైల్వే స్టేషన్‌లో ఇద్దరి రైళ్లూ ఆగాయి. ఆ సమయంలో ఇద్దరూ కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

జూ వెలుపల వింత ఆకారం.. వివరాలు తెలుసుకునేందుకు స్థానికుల సహాయం కోరిన సిబ్బంది!


ఈ సెల్ఫీని సురేష్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశారు. `అద్భుతమైన సెల్ఫీ. రైల్వేలో తండ్రి గార్డు.. కొడుకు టీటీఈ. రెండు రైళ్లు పక్కపక్కనే ఆగడంతో తీసుకున్న సెల్ఫీ ఇది` అని కామెంట్ చేశారు. ఆ ఫొటోలో తండ్రీకొడుకులు యూనీఫామ్ ధరించి ఉన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను 28 వేల మంది లైక్ చేశారు. 1700 మంది రీ ట్వీట్ చేశారు. ఆ తండ్రీకొడుకులపై చాలా మంది నెటిజ్లను ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-06-16T22:46:48+05:30 IST