ప్రియుడి దారుణ హత్య.. భర్తే చంపించాడని తెలిసి 40 ఏళ్ల ఆ భార్య నిర్వాకమిది.. ఇంట్లోంచి బయటకు వెళ్లి..
ABN , First Publish Date - 2022-05-24T18:24:14+05:30 IST
వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు.. ఎంతో మంది ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి.
వివాహేతర సంబంధాలు కాపురాల్లో చిచ్చు పెట్టడమే కాదు.. ఎంతో మంది ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి. తాజాగా రాజస్థాన్లో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు చనిపోయారు. తన ప్రియుడిని భర్తే చంపించాడని తెలియడంతో ఓ మహిళ రైలు కింద పడి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..
కాబోయే భర్త కారులో కనిపించిందో కాగితం ముక్క.. దానిపై ఓ అమ్మాయి పేరు, ఫోన్ నెంబర్.. ఆమె కంగారుగా కాల్ చేస్తే..
రాజస్థాన్లోని బికనీర్కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ తన భర్త మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలిసి భర్త ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె భర్త మాట వినకుండా వివాహేతర సంబంధం కొనసాగించింది. తీవ్ర ఆగ్రహం పెంచుకున్న భర్త తన మేనల్లుడిని ఆదివారం చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారమే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రియుడు చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ సోమవారం మధ్యాహ్నం రైలు కింద పడి చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు.