Crime: దారుణం.. కేవలం రూ.300 కోసం స్నేహితుడితో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-08-22T17:49:21+05:30 IST
వారిద్దరూ స్నేహితులు.. కలిసి తిరిగేవారు.. అప్పుడప్పుడు డబ్బులు అప్పుగా ఇచ్చి పుచ్చుకునేవారు.
వారిద్దరూ స్నేహితులు.. కలిసి తిరిగేవారు.. అప్పుడప్పుడు డబ్బులు అప్పుగా ఇచ్చి పుచ్చుకునేవారు.. కొన్ని రోజుల క్రితం వారిలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి రూ.300 అప్పుగా ఇచ్చాడు.. ఎన్నిసార్లు అడిగినా అవతలి వ్యక్తి తిరిగి ఇవ్వలేదు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.. తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యక్తి తన స్నేహితుడిని రాయితో కొట్టి చంపేశాడు.. గుజరాత్ (Gujarat)లోని సూరత్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి..
Rajasthan: చేయడానికి పనిలేక.. భార్యాపిల్లల ఆకలి తీర్చలేక.. ఓ భర్త చేసిన దారుణమిదీ.. 11 నెలల పసికందు అని కూడా చూడకుండా..
సూరత్లోని అమ్రోలి వంతెన కింద నివసించే గోవింద్సింగ్, రామ్సింగ్ స్నేహితులు. ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ తమ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం రామ్సింగ్ నుంచి గోవింద్ రూ.300 అప్పుగా తీసుకున్నాడు. తన డబ్బులు ఇవ్వాలని రామ్సింగ్ ఎన్ని సార్లు అడిగినా గోవింద్ స్పందించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రామ్సింగ్ సింగ్ నేరుగా గోవింద్ ఇంటికి వెళ్లి అతడి భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఈ విషయమై గోవింద్ సింగ్, మాన్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన గోవింద్ పక్కనే ఉన్న పెద్ద రాయి తీసి మాన్ సింగ్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మాన్సింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గోవింద్ను అదుపులోకి తీసుకున్నారు.