స్కూలు నుంచి వచ్చిన ఐదేళ్ల బాలుడి బుగ్గలపై ఎర్రటి చారలు.. ఏమైందని కంగారుగా ఆ తల్లి అడిగితే కొడుకు చెప్పింది విని..
ABN , First Publish Date - 2022-07-18T21:05:03+05:30 IST
ఆ ఐదేళ్ల బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు.. శనివారం సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తన కొడుకును చూసి తల్లి షాకైంది..
ఆ ఐదేళ్ల బాలుడు ఒకటో తరగతి చదువుతున్నాడు.. శనివారం సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తన కొడుకును చూసి తల్లి షాకైంది.. అతని బుగ్గలు ఎర్రగా మారిపోయాయి.. చెంపలపై వేలిముద్రలు ఉన్నాయి.. ఏం జరిగిందని అడ్డగా.. స్కూలు టీచర్, ప్రిన్సిపాల్ కొట్టినట్టు ఆ బాలుడు చెప్పాడు.. కింద పడిన తన స్నేహితుడి పెన్సిల్ తీస్తుండగా చూసిన టీచర్ తనను పిలిచి కొట్టారని, అదే సమయంలో వచ్చిన ప్రిన్సిపాల్ కూడా కొట్టారని చెప్పాడు. ఆ బాలుడి తల్లి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి పాఠశాలపై ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి..
X Ray Machines కు కూడా చిక్కలేదు.. అయినా అనుమానంతో ఈ Beauty Creams ను కత్తిరించి చూస్తే..
Indoreకు చెందిన నితిన్ అనే ఐదేళ్ల కుర్రాడిని చిన్న కారణానికి స్కూలు టీచర్, ప్రిన్సిపాల్ అతి దారుణంగా కొట్టారు. స్నేహితుడి పెన్సిల్ కింద పడిపోగా, నితిన్ దానిని తీసేందుకు కిందకు వంగాడు. అప్పుడు చూసిన స్కూల్ టీచర్ నితిన్ను పిలిచి కొట్టారు. ఆ కుర్రాడు చెప్పేది వినిపించుకోకుండా పెన్సిల్ ఎందుకు తీస్తున్నావని చితక్కొట్టారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన స్కూలు ప్రిన్సిపాల్ కర్రతో ఆ బాలుడి భుజంపై, వీపుపై కొట్టారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి జ్యోతి స్థానిక పోలీస్ స్టేషన్లో స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఆ పాఠశాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆ మహిళకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మహిళ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించింది.