స్నేహితులుగా ఉందామంటూ యువతి సలహా.. అలాగే అని ఒప్పుకొన్న యువకుడు.. ఓ రోజు ఆమెకు ప్రపోజ్ చేయడంతో..

ABN , First Publish Date - 2022-10-15T00:19:15+05:30 IST

చాలా మంది యువతీయువకుల మధ్య ఏర్పడే పరిచయం.. కొన్నాళ్లకు స్నేహమై, మరికొన్నాళ్లకు ప్రేమగా మారుతుంటుంది. తర్వాత కొందరి ప్రేమలు మాత్రమే పెళ్లి వరకూ వెళ్తుంటాయి. అయితే..

స్నేహితులుగా ఉందామంటూ యువతి సలహా.. అలాగే అని ఒప్పుకొన్న యువకుడు.. ఓ రోజు ఆమెకు ప్రపోజ్ చేయడంతో..
ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది యువతీయువకుల మధ్య ఏర్పడే పరిచయం.. కొన్నాళ్లకు స్నేహమై, మరికొన్నాళ్లకు ప్రేమగా మారుతుంటుంది. తర్వాత కొందరి ప్రేమలు మాత్రమే పెళ్లి వరకూ వెళ్తుంటాయి. అయితే కొందరు యువతులు మాత్రం కేవలం స్నేహానికి మాత్రమే విలువ ఇస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో యువకులు ప్రేమ పేరుతో వేధించడం, ఒప్పుకోకపోతే దాడులు చేయడం జరుగుతుంటుంది. ఈ తరహా ఘటనలు గతంలో చాలా జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. ఇటీవల చెన్నైలో ఓ యువతి విషయంలో ఇలాగే జరిగింది. వివరాల్లోకి వెళితే..


చెన్నై (Chennai) టీనగర్ పరిధికి చెందిన ఓ యువతి.. బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈమెకు కళాశాలలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వీరిలో ఆదంబాక్కంకు చెందిన సతీష్ కూడా ఒకడు. సతీష్‌ను ఆమె అందరి స్నేహితుల మాదిరే చూసేది. అయితే సతీష్ మాత్రం ఎలాగైనా ఆమెను ప్రేమలోకి దింపాలని నిర్ణయించుకున్నాడు. రోజూ ఆమెతో చనువుగా ఉండేవాడు. స్నేహితుడు (friend) కావడంతో ఆమె కూడా సన్నిహితంగా ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెతో తన మనసులోని మాటను చెప్పేశాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. మనం జీవితాంతం మంచి స్నేహితుల్లాగా ఉందామంటూ సర్దిచెప్పింది. సరే అని ఆమె ముందు ఒప్పుకొన్నా.. మనుసులో మాత్రం ఎలాగైనా ప్రేమలోకి (love) దింపాలని అనుకున్నాడు.

B.Com Idli Wala Viral Video: బీకామ్ చదివి మరీ ఓ బైక్‌పై ఈ కుర్రాడు ఇడ్లీలు అమ్ముకోవాల్సి రావడం వెనుక..!


ప్రేమించాలంటూ తరచూ ఆమె వెంటపడేవాడు. అయినా యువతి మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఓ రోజు నిన్ను ప్రేమించే ప్రసక్తే లేదంటూ తెగేసి చెప్పింది. దీంతో ఆమెపై సతీష్ పగ పెంచుకన్నాడు. గురువారం యువతి కళాశాలకు వెళ్లేందుకు సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వేచి చూస్తూ ఉంది. ఆమెను గమనించిన సతీష్.. దగ్గరికి వెళ్లి మళ్లీ ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. యువతి తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సతీష్.. ఆమెను ఎదురుగా వస్తున్న రైలు కింద తోసేసి పరారయ్యాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి.. నేరుగా ఇంటికి వెళ్లి తాత మొబైల్ పరిశీలించగా.. షాకింగ్ దృశ్యాలు..



Updated Date - 2022-10-15T00:19:15+05:30 IST