ఓ వైపు భార్య, మరోవైపు మేనత్త.. ఒకరికొకరికి తెలీకుండా వ్యవహారం.. చివరకు ఓ రోజు పొలం పనికని వెళ్లి..
ABN , First Publish Date - 2022-10-15T22:31:45+05:30 IST
సంతోషంగా సాగుతున్న సంసారంలో ఒక్కోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. కొన్నిసార్లు విధి వశాత్తు జరిగితే.. మరికొన్నిసార్లు దంపతులు తెలిసి తెలిసి సమస్యలను..
సంతోషంగా సాగుతున్న సంసారంలో ఒక్కోసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. కొన్నిసార్లు విధి వశాత్తు జరిగితే.. మరికొన్నిసార్లు దంపతులు తెలిసి తెలిసి సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. చివరకు ఆత్మహత్యలకు పాల్పడడమో, జైలు పాలవడమో జరుగుతుంటుంది. ఎక్కువగా వివాహేతర సంబంధాల కారణంగానే సమస్యలు తలెత్తుతుంటాయి. పశ్చిమబెంగాల్లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వైపు భార్య, మరోవైపు మేనత్త.. ఒకరికొకరికి తెలీకుండా వ్యవహారం నడిపించాడు. కానీ చివరకు ఓ రోజు పొలం పనులకు వెళ్తున్నానని చెప్పి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్లోని (West Bengal) మాల్దా పరిధి పర్తులికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి పదేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్యా, పిల్లలతో సంతోషంగా ఉన్న వీరి కుటుంబంలో అనుకోని సమస్యలు వచ్చిపడ్డాయి. యువకుడి మేనమామ చనిపోవడంతో మేనత్త ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మేనత్త ఇంటికి తరచూ వెళ్లి వస్తూ ఉండేవాడు. ఆమె ఇంటి బాధ్యతలు కూడా ఇతడే చూసుకునేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భార్యకు తెలీకుండా మేనత్తతో సరసాలు ఆడుతూ ఉండేవాడు. ఇంట్లో కంటే మేనత్త ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు.
తమ కూతురు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి టీచరే కారణమంటూ ఆరోపణ.. అసలు క్లాస్ రూమ్లో ఏం జరిగిందంటే..
ఈ క్రమంలో భార్యకు విషయం తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. గ్రామ పెద్దలు కలుగజేసుకుని యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతడు మాత్రం తరచూ మేనత్తతో కలుస్తూ ఉండేవాడు. దీంతో ఇటీవల ఇంట్లో గొడవలు (Family quarrels) మరింత పెరిగాయి. దీంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మంగళవారం పొలం పనులకు వెళ్తున్నానని చెప్పి.. నిర్మానుష్య ప్రదేశంలో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి మృతికి అతడి మేనత్తే కారణమనే విషయం గ్రామం మొత్తం తెలిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం మృతుడి మేనత్త ఊరు వదిలి పారిపోయే ప్రయత్నం చేసింది. గమనించిన స్థానికులు, మృతుడి భార్య.. ఆమెను పట్టుకుని చితకబాదారు. అనంతరం జుట్టు కత్తిరించి గ్రామంలో ఊరేగించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.