రాత్రి అన్నం తిన్నాక వాకింగ్‌కు వెళ్లిన 33 ఏళ్ల భార్య.. తెల్లారినా తిరిగి రాకపోవడంతో కేసు పెట్టిన భర్త.. అదే ఊళ్లో ఓ ఇంట్లో..

ABN , First Publish Date - 2022-05-26T22:49:17+05:30 IST

రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమెకు వాకింగ్‌కు వెళ్లడం అలవాటు.. ఎప్పటిలాగానే ఈ నెల 22వ తేదీన కూడా ఆమె వాకింగ్‌కు వెళ్లింది..

రాత్రి అన్నం తిన్నాక వాకింగ్‌కు వెళ్లిన 33 ఏళ్ల భార్య.. తెల్లారినా తిరిగి రాకపోవడంతో కేసు పెట్టిన భర్త.. అదే ఊళ్లో ఓ ఇంట్లో..

రాత్రి భోజనం చేసిన తర్వాత ఆమెకు వాకింగ్‌కు వెళ్లడం అలవాటు.. ఎప్పటిలాగానే ఈ నెల 22వ తేదీన కూడా ఆమె వాకింగ్‌కు వెళ్లింది.. అయితే ఎంతసేపటికీ తిరిగి రాలేదు.. దీంతో ఆమె భర్త తర్వాతి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అన్వేషణ సాగించిన పోలీసులకు అదే రోజు సాయంత్రం ఆమె మృతదేహం లభ్యమైంది.. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు మూడ్రోజుల్లో నిందితుడిని కనిపెట్టి అరెస్ట్ చేశారు.. మహారాష్ట్రలోని అదాయ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

ఇది కూడా చదవండి.

కొట్టొద్దు నాన్నా.. నొప్పిగా ఉంది.. విషంతోనైనా చంపు.. తండ్రిని వేడుకున్న 20 ఏళ్ల ఓ యువతి.. అసలేం జరిగిందంటే..


అదాయ్ గ్రామానికి చెందిన రేష్మా సచిన్ అనే 33 ఏళ్ల మహిళ ఈ నెల 22వ తేదీ రాత్రి 10 గంటలకు భోజనం చేసి వాకింగ్‌కు వెళ్లింది. రేష్మ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె భర్త తర్వాతి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వేషణ సాగించారు. అదే గ్రామంలోని నిర్మాణంలో ఓ భవనంలో రేష్మ మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఆ గ్రామంలో ఆమెతో గొడవపడిన వారి జాబితాను పరిశీలించగా జయంత్ సురేష్ అనే వ్యక్తి మీద పోలీసులకు అనుమానం కలిగింది. రేష్మకు ఆటోలను అద్దెకు ఇచ్చే బిజినెస్ ఉంది. ఆమె నుంచి గతంలో సురేష్ ఒకసారి ఆటో అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య అద్దె విషయమై తీవ్రంగా గొడవ జరిగింది. ఆ కోపంతోనే సురేష్ హత్య చేసి ఉంటాడని రేష్మ భర్త పోలీసులకు చెప్పాడు. పైగా, హత్య జరిగిన స్థలానికి సురేష్ ఇల్లు దగ్గర్లోనే ఉంది. దీంతో సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అతడు నేరం అంగీకరించాడు. 

Updated Date - 2022-05-26T22:49:17+05:30 IST