MLC K Kavitha: రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు.
TELANGANA: కామారెడ్డి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని పిట్లం ఎస్బీఐ ఏటీఎంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.
తెలంగాణ: విధులు మరచి వింధులు, వినోదాల్లో మునిగి తేలిన ఓ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై రోగులు, బంధువులు దుమ్మెత్తి పోస్తున్నారు. రోగులను గాలికొదిలేసి జన్మదిన వేడుకలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ: నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రానికి చెందిన ముగ్గురు విద్యార్థినిలు స్థానికంగా ఉన్న బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. నూతన సంవత్సరం కావడంతో పలు ప్రాంతాలకు వెళ్లి చూసొద్దామని ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ప్లాన్ చేశారు.
ఎస్ఐ, కానిస్టేబుల్, నిఖిల్.. ముగ్గురి మృతి కేసులో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఓపెన్ కానీ ఫోన్ల లాక్స్ అడ్డంకిగా మారాయి. శృతి-సాయికుమార్ మధ్య సంబంధం, శృతి - నిఖిల్ ప్రేమాయాణం ఘటనపై కూడా విచారణ చేస్తున్నారు. ముగ్గురు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడి ఆత్మహత్య చేసుకున్నారా...
చాలా కాలం తర్వాత నిజామాబాద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వస్తున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలు తిహార్ జైలులో ఉన్న అనంతరం మొదటి సారి జిల్లాకు వస్తున్నారు. డిచ్పల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘనస్వా గతం పలుకుతారు. బై పాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్, ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారు.
Telangana: కామారెడ్డిలో ఇద్దరు పోలీసులు, ఓ యువకుడి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుల సెల్ ఫోన్ డాటా, వాట్స్ ఆప్ చాటింగ్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ ముగ్గురి బంధువులు, స్నేహితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Telangana: రైతు భరోసాపై కీలక అప్డేట్ వచ్చేసింది. రైతు భరోసాను ఎప్పుడు ఇస్తారనే దానిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టతనిచ్చారు. అలాగే వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బీటీ రోడ్ వేస్తామని.. మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని వెల్లడించారు.
ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మాల్కు ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.