Home » YSRCP
ఏపీలో వైసీపీ ఉనికి కోల్పోతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు అసెంబ్లీలో చర్చించే దమ్ముందా..? అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వేలాది ప్రాణాలు బలిగొన్న విషపూరిత మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే, ధర్నాల పేరుతో జగన్నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతుల మనోభావాలతో జగన్ ఆటలాడుతున్నారని నిప్పులు చెరిగారు.
ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన పనులతోనే ఎన్నికల్లో ఓడించారని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.
గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు.
కూటమి సర్కార్పై వైసీపీ మరో కొత్త దుష్పచారాన్ని మొదలుపెట్టింది. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్రంలో వైసీపీ విష ప్రచారం చేస్తుంది.
జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేయగా, చంద్రబాబు మానవత్వంతో పునరుద్ధరించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా, జగన్ ఐదేళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి ట్విస్ట్ ఇచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు . నిన్న(శనివారం) తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించారు పోలీసులు. ఇవాళ(ఆదివారం) తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు.
గత ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో వైద్యశాఖ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. దాని పర్యవసానాలను కోవిడ్ సమయంలో అందరూ ప్రత్యక్షంగా అనుభవించారని చెప్పుకొచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుతున్న జగన్ కావాలని రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.