Home » YSR Congress
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకునే సరికి.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక పార్టీ మారిన నేతలు అయితే.. బాబోయ్ మునుపటి పార్టీ బాగోతం బట్టబయలు చేస్తున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా మీడియా మీట్, బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దుమ్ముదులిపేస్తున్నారు. తాజాగా.. ప్రముఖ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ (YSR Congress) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నది ఒకే ఒక్క మాటే అయినా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆయన ఏమన్నారో చూసేద్దాం రండి..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) మేనిఫెస్టో (NDA Manifesto) వచ్చేసింది. దీంతో మేనిఫెస్టో ఏయే వర్గాలకు ఏమేం శుభవార్తలు చెప్పారు..? పెన్షన్లు ఎంత పెంచారు..? విద్యార్థులకు కూటమి ఇచ్చిన హామీలేంటి..? రైతన్నలకు చంద్రన్న చెప్పిన ప్రకటనలేంటి..? మహిళలకు ఏమేం ఉచితమని చెప్పారు..? బీసీలు, ముస్లిం మైనార్టీలకు ఎన్డీఏ ఎలాంటి శుభవార్తలు చెప్పింది..? ఇలా ఒకటా రెండా.. ఆయా వర్గాలు నిశితంగా మేనిఫెస్టో చదివే పనిలో నిమగ్నమయ్యాయి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. పోలింగ్కు ముందే కొందరు నేతలు, కార్యకర్తలు భవిష్యత్ కార్యాచారణ ప్రకటిస్తూ పార్టీలు మారిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) సమయం దగ్గరపడింది. సమయం లేదు మిత్రమా అంటూ అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశం ములుచుకుని అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ఇదలా ఉంచితే.. పోలింగ్ రోజు ఓటర్లకు లెక్కలేనన్ని అనుమానాలు వస్తుంటాయ్. అసలు ఓటు పడిందా..? లేదా..? ఒకవేళ ఓటు పడిందనుకో తాము వేసిన పార్టీకే పడిందా లేదా.. క్రాస్ అయ్యిందా..? ఇలా చాలా అనుమానాలే వస్తుంటాయ్. అయితే.. ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజలు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.. జగన్ వీరాభిమానులు స్పందిస్తున్నారు. వారి రియాక్షన్ చూస్తే...
రాష్ట్ర ప్రజలకు తామిచ్చిన సూపర్ సిక్స్ హామీల ముందు సీఎం జగన్ మేనిఫెస్టో తేలిపోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది...
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకుగాను (AP Elections) నామినేషన్ల పర్వం ముగియడంతో.. గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో.. ఇదిగో మేనిఫెస్టో (YSRCP Manifesto) అంటూ కొద్దిరోజులుగా హడావుడి చేసిన వైసీపీ (YSR Congress) ఎట్టకేలకు శనివారం (ఏప్రిల్-27న) రిలీజ్ చేసింది.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు..
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు గాను వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో ఏమేం హామీలు ఇచ్చారు..? ఎంతవరకూ అమలు చేశారు..? ఇలా అన్ని విషయాలను నిశితంగా వివరించిన తర్వాత 2024 మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేశారు. గతంలో లాగే ఈసారి కూడా 2 పేజీలతోనే మేనిఫెస్టోను జగన్ రిలీజ్ చేయడం జరిగింది..
ఎవరీ పద్మావతి.. ఇప్పుడీ ఈ పేరు ఒక్క గుడివాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీమె.. ఎందుకింతలా హైలైట్ అవుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..