Home » YS Viveka
2019 మార్చి 15.. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) మరణించారన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి చెప్పిందెవరు? ఆ కబురు ఆయనకు ఎలా చేరింది? ఇప్పుడు ఇదో పెద్ద మిస్టరీ!..
వివేకా హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో ఆయన నేడు రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుపై సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని అజేయ కల్లం పేర్కొన్నారు. ఏప్రిల్ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. వివేకా హత్య కేసులో ఇటీవల కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
ప్రైవేట్ డిటెక్టివ్కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్షీట్లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్ లాజిక్ను సీబీఐ మిస్ చేసింది. జగన్ను డీమోరలైజ్ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు.
వివేకా హత్య కేసులో కీలక సాక్షి, ఫిర్యాదుదారు, ‘అనుమానితుడు’ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నుంచి జమ్మలమడుగులో జగన్ మీడియా విలేకరి వరకు అనేకుల వాంగ్మూలాలు ఇప్పుడు బయటపడ్డాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుదీర్ఘంగా విచారణ కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో వాంగ్మూలాల్లోని కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సీబీఐ కోర్టుకు వెల్లడించిన రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సందర్భంగా సీబీఐ అధికారులు రహస్య సాక్షి ప్రస్తావనను హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు.
సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులతో పాటు కడప జిల్లాను 145 పేజీల సీబీఐ చార్జిషీటు కలవరపరచింది. పులివెందులతో పాటు కడప ఉమ్మడి జిల్లాలోఎక్కడ చూసినా మరోసారి జనంలో వైఎస్ వివేకా హత్య కేసులో చర్చే జరుగుతోంది. వైఎస్ వివేకా హత్యకేసులో రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల్లో సీబీఐ చార్జిషీట్ హాట్ టాపిక్గా మారింది. సీబీఐ చార్జిషీట్లో కీలక వాంగ్మూలాలతో ఎవరిపాత్ర ఏంటని కుట్రలు బట్టబయలు చేయడంపై సర్వత్రా సీబీఐకి ప్రశంసల జల్లు కురుస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. అలాగే మరికొంత మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది.
మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు చార్జిషీట్లో పలు అంశాలను ప్రస్తావించింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను సీబీఐ ఇలా వివరించింది.