Home » YS Viveka
మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులతో పాటు కడప జిల్లాను 145 పేజీల సీబీఐ చార్జిషీటు కలవరపరచింది. పులివెందులతో పాటు కడప ఉమ్మడి జిల్లాలోఎక్కడ చూసినా మరోసారి జనంలో వైఎస్ వివేకా హత్య కేసులో చర్చే జరుగుతోంది. వైఎస్ వివేకా హత్యకేసులో రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల్లో సీబీఐ చార్జిషీట్ హాట్ టాపిక్గా మారింది. సీబీఐ చార్జిషీట్లో కీలక వాంగ్మూలాలతో ఎవరిపాత్ర ఏంటని కుట్రలు బట్టబయలు చేయడంపై సర్వత్రా సీబీఐకి ప్రశంసల జల్లు కురుస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. అలాగే మరికొంత మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది.
మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. వివేకా హత్య కేసు చార్జిషీట్లో పలు అంశాలను ప్రస్తావించింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను సీబీఐ ఇలా వివరించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. మంగళవారం ఉదయం సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) దాదాపు చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీబీఐ (CBI) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపునకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS Viveka Mur) కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది..
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సీబీఐ కోర్టులో వాయిదా పడింది.
వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను టెక్నికల్ తప్పిదాల కారణంగా సీబీఐ కోర్టు వెనక్కి పంపించింది. దీంతో సీబీఐ మళ్లీ ఛార్జ్ షీట్ను రీసబ్మిట్ చేసింది.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన అర్హతపై స్పష్టత ఇవ్వాలని ఏ9 ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే వదిలేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉంటూ వరుసగా సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని (MP Avinash Reddy) జూన్-03 తారీఖున సీబీఐ అరెస్ట్ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..