Home » Yashasvi Jaiswal
Rohit sharma-KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు.
2027 వన్డే ప్రపంచకప్కు టీమిండియాలో యువ ఆటగాళ్లే కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తారలు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే ఉత్పన్నం అవుతోంది.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రపంచకప్లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్కు దూరమైన గిల్.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగే మ్యాచ్లో కూడా ఆడడం లేదు.
ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ ఆటగాడు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన సాయి కిషోర్కు ఎట్టకేలకు ఆ అవకాశం రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్పై టీమిండియా 23 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. యశస్వి జైస్వాల్(100) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట టీమిండియా భారీ స్కోర్ చేసింది.
ఏషియన్ గేమ్స్ 2023 క్వార్టర్ ఫైనల్ 1లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో 49 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.
యశస్వి జైస్వాల్(100) సెంచరీతో పెను విధ్వంసం సృష్టించడంతో నేపాల్ ముందు టీమిండియా 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్లో రింకూ సింగ్(37) బ్యాటు ఘుళిపించడంతో టీమిండియా స్కోర్ 200 దాటింది.
కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జేసన్ హోల్డర్ స్థానంలో చేజ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.
అరంగేట్రంలోనే భారీ సెంచరీతో దుమ్ములేపిన టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన కుటుంబానికి అదిరిపోయే బహుమతిని ఇచ్చాడు. తన కుటుంబం కోసం ఏకంగా 5 బెడ్రూంల ఇంటిని కొన్నాడు. ఇటీవల అతని కుటుంబం డబుల్ బెడ్రూం ఇంటి నుంచి 5 బెడ్రూంల ఇంటికి మారింది.
సోషల్ మీడియాలో జైశ్వాల్ గురించి ఓ మీమ్ చక్కర్లు కొడుతోంది. అతడు క్రికెట్లోకి రాకముందు సినిమాల్లో నటించాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో యషస్వీ జైశ్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం నటించాడని అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో బాలనటుడిగా జైశ్వాల్ నటించినట్లు ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు.