Home » Yarlagadda Venkatrao
వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు కట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారని గన్నవరం టీడీపీ ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు ఖాకీ యూనిఫాం వేసుకుని వైసీపీ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారన్నారు. పోలీసులు తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని తెలిపారు.
విజయవాడలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఓ కేసు వాయిదా కోసం కోర్టుకు గన్నవరం టీడీపీ (TDP), వైసీపీ నేతలు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు కోర్టు ఆవరణలో అలజడి సృష్టించారు.
గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలానే 11 వేల నకిలీ పత్రాలను మాజీ ఎమ్మెల్యే వంశీ పంపిణీ చేశారు. అప్పట్లో బాపులుపాడు మండలానికే నకిలీ పట్టాల పంపిణీ పరిమితమైంది.
గన్నవరంలో దొంగ ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నిజమైన నిరుపేద అర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తే తానే స్వాగతిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే తరహా దొంగ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల చేరికకు కుట్ర పన్నిందన్నారు.
కృష్టా జిల్లా: వల్లభనేని వంశీ, అతని అనుచరులను టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ఆయన మండిపడ్డారు. ఊరి చెరువు మట్టి కొంతమంది జేబులోకి వెళుతుంటే సోదరులారా మీరెందుకు ప్రశ్నించడం లేదన్నారు. దాడులు చేసి రివర్స్ కేసు పెట్టే పరిస్థితి గన్నవరంలో ఉందన్నారు...
AP Congress : ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార వైసీపీకి ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంచార్జుల మార్పు ఏ క్షణాన సీఎం వైఎస్ జగన్ రెడ్డి షురూ చేశారో.. టపీ టపీమని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్లు రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. అయితే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నుంచి చేరికలు ఇప్పుడిప్పుడే షురూ అవుతున్నాయి..
Andhrapradesh: ప్రసాదంపాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై దాడిని గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా యార్లగడ్డ వెంకట్రావ్ నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు వెంకట్రావ్ను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, శ్రేణులు తెలుగుదేశంలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్లు, సహకార బ్యాంకు సభ్యులు, ఇతర నియోజకవర్గం నేతలు ఉన్నారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!