Home » Yadadri Bhuvanagiri
వినతులు, ఆవేదనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, నిరసనలు, ఆనందాలు! ఇలా పథకాల్లో తమ పేర్ల నమోదుకు సంబంధించి ఆశావహుల ద్వారా గ్రామసభల్లో వ్యక్తమైన రకరకాల భావోద్వేగాలు!!
MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు. రౌడీ మూకలతో దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్ది కాదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మా జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు.
ఓ యువకుడు బ్రెయిన్డెడ్ కావడంతో అతడి అవయవాలను మరో ఎనిమిది మందికి దానం చేసి కుటుంబసభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. 14 మంది ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసేక్రమంలో దాన్నే ఢీకొట్టింది.
భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
Telangana: భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది.
Telangana: విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈఏ సత్యనారాయణ ఉత్తర్వుల జారీ చేశారు. గత కొన్నేళ్లుకు పాఠశాలకు చెందిన 16 మంది టీచర్లు విధులకు హాజరుకావడం లేదు.
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి(Bhuvanagiri)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో వేడి రాగి జావ మీద పడి ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటనలో ఆ గురుకులం ప్రిన్సిపాల్ వెంకటేశంపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపం ఉందని భావిస్తూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.