Home » Womens Reservation Bill
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అభియాన్' బిల్లు ఎట్టకేలకు మంగళవారంనాడు లోక్సభకు ముందుకు వచ్చింది. దీంతో ఈ బిల్లు నేషనల్ డపవల్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ బ్లాక్ ఐక్యతకు తొలి పరీక్ష కానుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలివే..
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పార్లమెంటు నూతన భవనంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ జరుగుతుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది.
పార్లమెంట్(Parliament)లో మహిళ బిల్లుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆమె క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని కవిత తెలిపారు.
కవిత(BRS MLC K Kavitha) ఢిల్లీ(Delhi)లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి 13 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై మద్దతు తెలిపారు.
మహిళా రిజర్వేషన్లు అనేది గొప్ప ప్రజాకర్షక నినాదం. అయితే ఇది ఎంత ఆకర్షణీయమైనదో, అంత వివాదాస్పదమైనదిగా కొనసాగుతోంది.
జంతర్మంతర్లో (Jantar Mantar) మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill) కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) చేపట్టిన దీక్ష ముగిసింది.