Home » Warangal
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం నిర్వహించనున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు.
లోకసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయింది. మంగళవారం జరగాల్సిన ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన కాసేపటికే పర్యటన రద్దవ్వడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన వరంగల్లో పర్యటించనున్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై రాహుల్ గాంధీ ప్రజల రియాక్షన్ తెలుసుకోనున్నారు. అలాగే రైల్వే ప్రయివేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నారు.
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఖమ్మం జైలుకు తరలించారు.
ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో హనుమకొండ ట్రాన్స్పోర్టు డీటీసీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించింది ఏసీబీ.
భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొత్త వివాదం ఏర్పడింది. స్థానికంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంపై రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది.
అజాం జాహి మిల్లు భూములకు సంబంధించి హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్ వాసి సుద్దాల నాగరాజు తప్పుడు ప్రతాలు సృష్టించారని మావోయిస్టు నేతలు ఆరోపించారు. ఆ తప్పుడు పత్రాలతో వారు మిల్లు భూములు అమ్మేసి డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు.
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేయడం అంటేనే ఐపీఎస్ అధికారులకు సవాలు లాంటిది. అలాంటిచోట విధి నిర్వహణ కత్తి మీద సాము లాంటిదే.
వరంగల్ జానిపీరీలకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వరంగల్: నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న కల్యాణి ఆస్పత్రి ఘటన మరువకముందే నేడు మరో దారుణం బయటపడింది. ఏకశిలా ఆస్పత్రి యాజమాన్యం తన మెడికల్ రిపోర్టులు మార్చారంటూ హనుమకొండ జిల్లా వంగపహాడ్కు చెందిన ప్రశాంత్ ఆందోళనకు దిగాడు.