Home » Warangal
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఏసీబీకి చిక్కారు.
మా పార్టీ గద్దెలను టచ్ చేస్తే... యుద్ధమేనని పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాను సీఎంనన్న సంగతి కూడా మరిచిపోయి మాట్లాడుతున్నారంటా వ్యాఖ్యానించారు. ఇంకా వారు ఏమన్నారంటే...
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి తమ మొక్కులను చెల్లంచుకుంటున్నారు. ఈనెల 28 నుంచి మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. అప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో ముందస్తుగానే విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మేడారం.. భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగా విచ్చేసి తమతమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. దీంతో మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న ఆయన విడుదల కానున్నారు.
కోడిమాంసం దరలు రోజురోజుకు పెరుగుతుండడంతో.. సామాన్యులు చికెన్ కొని వండుకొని తినే పరిస్థితి లేకుండా పోతోంది. ప్రస్తుతం చికెన్ రేట్లు మాంసంతో పోటీపడుతున్నాయి. పనిలోపనిగా మరోపక్క మేడారం మహాజాతర కూడా రావడంతో ఇక కోళ్ల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లను శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. అయితే.. పెద్దఎత్తున భక్తులు విచ్చేయనుండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా 15 రోజుల గడువు ఉన్నప్పటికీ ప్రస్తుతం మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 30 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.
జనగామ జిల్లాను రద్దు చేస్తే.. అగ్నిగుండమే.. అని బీఆర్ఎస్ నాయకుడు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.