Home » Warangal
Drug Control Raids: నిజామాబాద్లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు.
Encounter: ఛత్తీస్గఢ్లో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.
వరంగల్ ఆర్ఈసీ... దేశ, విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పని చేసిన తెలుగు ఇంజనీరింగ్ నిపుణులను అందించిన ఘనత ఈ విద్యా సంస్థకు దక్కుతుంది. మరోవైపు పీపుల్స్వార్ గ్రూప్లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుంచి వచ్చారు.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు కశ్మీర్లో విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య (army jawan suicide) చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Konda Surekha: గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు.
ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు టూర్ వివాదాస్పదం కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రామప్పలో అసలు ఏం జరిగింది? అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది.
సంప్రదాయ చీరకట్టు, నుదుట బొట్టు, జడ కొప్పు, మల్లెపూలు ధరించి.. ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆట, పాటలతో నృత్యాలు చేశారు.
Miss World Contestants: అందాల భామలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే..
Operation Sindoor: కర్రెగుట్టల్లో మావోయిస్టుల వేటకు కాస్త విరామం పడింది. ఆపరేషన్ కగార్పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. వెంటనే బార్డర్కు వెళ్లాల్సిందిగా సీఆర్పీఎఫ్ బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత వేసవి సెలవుల రద్దీ నేపధ్యంలో ఈనెల 12వతేదీ నుంచి చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లలో కొన్ని నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా, మరికొన్ని ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.