Home » Vizag News
విశాఖ స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టులో కార్మికుల మధ్య ఏర్పడిన వివాదంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఈరోజు(బుధవారం) విచారణ చేపట్టింది. ఈ వివాదంపై యూనియన్ కోర్టు హైకోర్టులో ధిక్కార పిటీషన్ దాఖలు చేసింది. గంగవరం పోర్టులో కార్మికుల ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్కు బొగ్గు సరఫరా ఆగిపోయిందని వెంటనే జోక్యం చేసుకోవాలని గతంలో హైకోర్టులో పోర్టు యూనియన్ నేత కేవీడి ప్రసాద్ పిటీషన్ దాఖలు చేశారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ (CM Jagan) నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. విశాఖ కంచరపాలెంలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్.. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి గణబాబు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి. విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు.వేపగుంటా మీనాక్షి కన్వేషన్స్లో కూటమి ఆద్వర్యంలో ఎలైట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నితిన్ గడ్కరీ. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు..కూటమి పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు.
కొంతమంది తనపై దాడికి ప్లాన్ చేశారని జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు. తాను సీబీఐ జేడీగా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు.ఆ వ్యక్తి అభిమానులు ఇప్పుడు తనపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో సీఎం జగన్, ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తుచేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు.
ఎక్కువ శాతం ముస్లింలు, క్రిస్టియన్లు బీజేపీ (BJP)ని వ్యతిరేకించడం లేదని విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీభరత్ (Sri Bharat) అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో గురువారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమికి పూర్తి మద్దతును ముస్లింలు, క్రిస్టియన్లు తెలియజేశారు.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్(Visakhapatnam to Chennai Egmoor), బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
వచ్చే నెలలో ఎన్నికయ్యేలోగానే విశాఖపట్నం స్టీల్ప్లాంటును మూసివేయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీస్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ప్లాంటును ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టును అదానీ గ్రూపు పూర్తిగా హస్తగతం చేసుకున్న
మొన్న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ని టార్గెట్ చేస్తూ ఒక షూటర్తో టీడీపీ నేతలు కొట్టించారని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆరోపించారు. సోమవారం నాడు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు రాయితో జగన్ని కొట్టించడం, నిన్న గులక రాళ్లతో దాడి చేయించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ అని కొనియాడారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు చంద్రబాబుపై రాళ్లు విసిరారు.