Home » Visakhapatnam
మధ్యతరగతి ప్రజలకు కొత్త పన్ను విధానం చాలా ఊరటనిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 5 పాలసీలు విధించుకున్నామని.. మధ్యతరగతి నిత్యావసరాలు, గృహోపకరణాలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశానికి ఉపయోగమైన సెక్టార్లని దృష్టిలో పెట్టుకొని స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చామని వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై కేంద్రమంత్రి నడ్డా ప్రశంసలు కురిపించారు. ఎన్డీయే పాలనను బాధ్యత కలిగిన, స్పందించే పాలనగా అభివర్ణించారు. గత 11 ఏళ్ల మోదీ నాయకత్వంలో సమర్ధవంతమైన పనితీరుతోపాటు జవాబుదారీ ప్రభుత్వాన్ని అందించామని చెప్పారు.
వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వైసీపీ అవినీతి పాలనకు కూటమి చరమగీతం పాడిందని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కోస్తాంధ్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటువంటి ఆవకాశం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడురోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించారు.
మంటల్ని గుర్తించిన అధికారులు వెను వెంటనే అప్రమత్తం అయ్యారు. ఇండియన్ నేవీ సాయం తీసుకున్నారు. హైలికాఫ్టర్ రంగంలోకి దిగింది. ట్యాంకర్పై నీళ్లు చల్లి మంటల్ని ఆర్పింది.
విశాఖపట్నంలో ఇవాళ జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో..
సగటు మనిషి కోపం నుంచే జనసేన పుట్టిందని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కళ్యాణ్ అన్నారు. 'సేనతో సేనాని' పేరిట జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా నేడు విశాఖపట్నంలో..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో ఏపీ ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైతుల కోసం అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.