Home » Visakhapatnam
అనకాపల్లి-చర్లపల్లి మధ్య ప్రత్యేక వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల మూడో తేదీ నుంచి నడవనున్నది. 17046 నంబరుతో అనకాపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 5.35 గంటలకు ఈ రైలును ప్రారంభిస్తారు.
అంకితభావం, కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరీమణులందరికీ హోం మంత్రి అనిత అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని అన్నారు.
రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర సహా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు.
విశాఖలో జరిగినది ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన మాత్రమే కాదని.. ఓ కొత్త యుగానికి పునాది అని అదానీ గ్రూప్ ఛైర్మన్ జీత్ అదానీ వివరించారు. ఎనర్జీ, డేటా, కనెక్టివిటీ.. ఈ మూడు కలిసి భారత అభివృద్ధిని తదుపరి దశకు నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు విజన్కు సెల్యూట్ చేస్తున్నామని, ఆయనను దేశం గర్వించే విజనరీ లీడర్గా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అభివర్ణించారు. చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం త్వరలోనే ఐటీపట్నం కాబోతోందన్నారు.
ఏపీ చరిత్రలో ఇవాళ మరిచిపోలేని రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో ప్రయోజనాలు చూపిస్తున్నామని పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.
గూగుల్ ఏఐ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు.
నేడు (సోమవారం) మార్కాపురం జిల్లా కంభంలో 45.7°C డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 227 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.