Home » Visakhapatnam
విశాఖను టూరిజం హబ్గా, ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలలు తెరిచే లోపు...తల్లికి వందనం ఇస్తామని చెప్పామని అలాగే మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఏపీ సీఎం చంద్రబాబు వినియోగించే హెలీకాప్టర్లో తరచుగా సమస్యలు వస్తున్నాయి. ఇవాళ మరోసారి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్కి ఈ హెలీకాప్టర్ని ఏపీ పర్యటన నిమిత్తం కేటాయించారు. కేంద్రమంత్రి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కిన సమయంలో మొరాయించడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కచోటే మూడు లక్షల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏపీవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Visakha Visit: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం గుజరాత్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Crime News: నందిగామ గోపీనాథ్పై పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని భార్యను ఒత్తిడి చేశాడు. కేసు వెనక్కి తీసుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ విషయంలో గత అర్ధరాత్రి 2:30 గంటల వరకు భార్య వెంకటలక్ష్మితో భర్త గోపినాథ్ గొడవపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోంది. దీని నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ, మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200కుపైగా దొంగతనాలకు పాల్పడిన హైదరాబాద్ వాసి మహ్మద్ సలీమ్ ఖురేషి(51)ని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు.
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
Lokesh Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం చారిత్రక కార్యక్రమమని.. కమిట్మెంట్తో ప్రతీ ఒక్కరూ పని చేయాలని.. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.