Home » Visaka
గతంలో వైసీపీలో పనిచేసి ఇటీవల టీడీపీలో చేరిన ఓ భూదళారీ ఊసరవెల్లిగా మారి విశాఖ, దాని చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను మింగేసిన కథ ఇది. రెవెన్యూ పెద్దల ఆశీస్సులతో ఇప్పటికే ఎండాడలోని మాజీ సైనికుల భూములను సెటిల్ చేసిన ఆ దళారీ నేత ఇప్పుడు మరికొన్ని భూములపై కన్నేశాడు.
Fishing ban end: సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు శనివారం అర్ధరాత్రి బయలుదేరారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల విరామం శనివారంతో ముగిసింది. దీంతో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లారు.
Parawada Pharma Accident: అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీలో దుర్ఘటన సంభవించింది. కంపెనీలోని ఎస్ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖపట్నాన్ని ప్రధాన ఆర్థిక శక్తిగా మలిచే ప్రతిష్ఠాత్మక రోడ్మ్యా్పను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఉత్తరాంధ్రలోని ఎనిమిది జిల్లాలను కలిపి ‘విశాఖ ఎకనామిక్ రీజియన్’గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రత 2°C పెరిగితే స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్ పూర్తిగా నీటిమట్టమవుతాయని తేలింది.
విశాఖలో 64 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయి మృతి చెందాడు. అయితే, ఆయన మరణానికి కారణం ఇతర ఆరోగ్య సమస్యలేనని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు.
Steel Plant Workers Strike: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. అడ్మిన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్ అస్వస్థతకు గురయ్యారు.
విశాఖ, నెల్లూరు, ఆత్మకూరులో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. భారీగా పాల్గొన్న ప్రజలు 'భారత్ మాతాకీ జై' నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు.
విశాఖలో జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ పర్యటనకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయాన్ని చూసుకుంటుంది.
Somu Veerraju: కుహానా రాజకీయ నేతల వలన దేశానికి నష్టమని.. వాళ్లు అద్దె మైకులలాంటివారని, భారతీయులు కాదని.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు.సెక్యులర్ విధానాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారు అన్నారు.