Home » Vijayasai Reddy
తిరుపతి లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్న వేళ.. నిజాలు నిగ్గు తేల్చుందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిజాయితీ గల అధికారులకు ఆ కమిటీలో చోటు కల్పించింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతోనే వైసీపీ నేతలు సిట్పై ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నేతలను 151స్థానాల నుంచి 11సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వారికి సిగ్గు రావడం లేదని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డితోపాటు దేవినేని అవినాశ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతల్ని ఏ పార్టీలో చేర్చుకోరని ఆయన ఎద్దేవా చేశారు.
Andhrapradesh: చీటెడ్ అకౌంటెంట్గా పేరుగాంచిన జైలుపక్షి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ నేత శ్రీనివాసరావు హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఎక్కువ మంది ఉన్నతాధికారులు, నాయకులు జైలు భయంతో సముద్రమార్గం, విమానయానం ద్వారా ఖండాతరాలు దాటి పారిపోతున్నారన్నారు.
విశాఖ జిల్లా భీమిలి బీచ్ సమీపంలో సీఆర్జడ్ నిబంధనలు ఉల్లంఘించి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డి నిర్మించిన ప్రహరీ గోడ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు జేసీబీలు ఆ ప్రాంతానికి చేరుకుని కూల్చివేతలను ప్రారంభించాయి.
మీడియా సంస్ధల అధినేతలు, జర్నలిస్టులను కించపరచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై జర్నలిస్టు, ప్రజాసంఘాలు, పలు పార్టీలు ధ్వజమెత్తాయి.
Andhrapradesh: మీడియాపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. విజయసాయిరెడ్డిపై జర్నలిస్టులు, మీడియాతో పాటు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలు మీడియా గొంతు నొక్కాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కుల ప్రాధాన్యాల గురించి విజయసాయి రెడ్డి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే అంటూ ఎద్దేవా చేశారు. 2022-24 మధ్యకాలంలో ఒక కులంపై కక్షకట్టి కేబినెట్లో ప్రాతినిధ్యమే లేకుండా చేశారని గుర్తుచేశారు.
‘ఎన్నికల్లో ఓ పొట్టోడు.. పొట్టి సారాయి రెడ్డి... నెల్లూరులో తిరిగాడు. నేను నెల్లూరోడిని, నెల్లూరోడిని అనే వాడు. నెల్లూరోడైతే వైజాగ్ లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు?’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
ఓ మహిళ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలతో పాటు పార్టీ ఓటమిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ ఓటమిపై మేము సమీక్షించుకుంటున్నామని తెలిపారు.