Home » Uttarakhand
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కుప్పకూలడంతో 36 మంది వరకూ అందులో చిక్కుకుపోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక కార్యక్రమాలు చేపట్టింది.
UCC: యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడి పౌర స్మృతి) అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్(Uttarakhand) అవతరించనుంది. జస్టిస్ (రిటైర్డ్) రంజనా దేశాయ్(Justice Ranjana Desai) నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించడంతో ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా చరిత్రలో నిలవనుంది.
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్(Uttarakhand) మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్కి(Harish Rawat) గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరీశ్ రావత్ మంగళవారం అర్ధరాత్రి హల్ద్వానీ నుంచి ఉదమ్ సింగ్ నగర్ లోని కాశీపుర్ కి కారులో బయల్దేరారు. బాజ్ పుర్ వద్దకు రాగానే రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీ కొట్టింది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పార్టీ విభాగాలన్నింటినీ రద్దు చేశారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్ర విభాగాలను రద్దు చేశామని, వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపింది.
బద్రీనాథ్, కేదార్నాథ్ లో ఈ సీజన్లో తొలిసారి మంచుకురవడం మొదలైంది. ఆదివారంనాడు మంచుకురవడం మొదలుకావడంతో చల్లటి వాతావరణం భక్తుల్లో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపింది. నవరాత్రి తొలిరోజునే వర్షంతో పాటు మంచుకురిసి ఒక్కసారిగా వాతావరణం అహ్లాదకరంగా మారింది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవలందించిన వారిని తోటి ఉద్యోగులు సన్మానించండం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తుచేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే అదే సన్మానం జంతువులకు చేస్తే ఎలా ఉంటుంది. తాజాగా...
ప్రమాదమని తెలిసినా కొందరు తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. చాలా మంది యువత అయితే వాహనం చేతిలో ఉంటే.. ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. అధిక వేగంతో కొందరు, అవగాహన లేక మరికొందరు ప్రమాదంలో చిక్కుకుంటుంటారు. ఇలాంటి...
ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లా లోహ్గాట్ ప్రాంతంలోని ప్రఖ్యాత అద్వైత ఆశ్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాత్రి బస చేయనున్నారు. ఈ ఆశ్రమంలో 1901లో స్వామి వివేకానంద బస చేశారు. అప్పట్నించి 122 ఏళ్ల ఆశ్రమ చరిత్రలో ఏ ఒక్క నేతను ఇందులో బస చేయడానికి యాజమాన్యం అనుమతించ లేదు.
ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. భార్యకు తెలీకుండా మరో యువతితో ప్రేమాయణం మొదలెట్టాడు. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమెతో ఏకంగా సహజీవనమే మొదలెట్టాడు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు మత్తులో ఉన్న ప్రియురాలిని కారులో..
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.