Home » Uttam Kumar Reddy Nalamada
ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచే యాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులకు పరిపాలనపరమైన అనుమతుల జారీ, ఇతర నిర్ణయాల్లో అధికారులు ఎలాంటి జాప్యం చేయరాదని ఆదేశించారు.
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకుపోతామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని తెలిపారు.
‘‘రైతులు ధాన్యం ఎమ్మెస్పీకి అమ్ముకోవటానికి రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 7,750 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. 80 లక్షల టన్నులు వచ్చినా, అంతకంటే ఎక్కువ ధాన్యం వచ్చినా కొనుగోలు చేయటానికి సరిపడా నిధులు సమకూర్చాం.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీ్సగఢ్ నుంచి నిరభ్యంతర పత్రం పొందడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అవసరానికి మించి ధాన్యం సేకరణ జరిగితే.. మిగులు ధాన్యాన్ని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు ఎగుమతి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. బ్యాంకు గ్యారెంటీ తీసుకున్న తర్వాత మిల్లర్లకు ధాన్యం అప్పగిస్తామన్నారు.
సంక్రాం తి పండుగ నుంచి రాష్ట్రంలోని 2.80కోట్ల మందికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకం టెండర్ల వివాదంలో నీటిపారుదలశాఖ అధికారుల ప్రవర్తనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా.. క్రమశిక్షణ రాహిత్యం, దుష్ప్రవర్తనపై వెంటనే సంజాయిషీ ఇవ్వాలంటూ జి.అనిల్కుమార్తో పాటు కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివా్సరెడ్డికి ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.