Home » Udayanidhi Stalin
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన తమిళనాడులోని కన్యాకుమారిలో రూ.37 కోట్లతో నిర్మించిన ఫైబర్ గ్లాస్ వంతెనను సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించారు.
అన్ని మతాలూ ఆత్మీయ భావాలనే బోధిస్తున్నాయని, తానొక క్రైస్తవుడినని చెప్పుకునేందుకు ఎంతగానో గర్వపడుతున్నానని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకే నాయకులు క్షేత్ర సమీక్ష పేరుతో అలజడులకు కుట్ర పన్నుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ధ్వజమెత్తారు. బుధవారం 48వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మెరీనా బీచ్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్మారక మందిరంలో ఉన్న కలైంజర్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగబోయే ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా డీఎంకే కార్యకర్తలు యుద్ధ సైనికుల్లా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంలో పేర్లు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) పిలుపునిచ్చారు. గురువారం తూత్తుకుడి జిల్లా పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం విమానంలో తూత్తుక్కుడి చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు.
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ ఇటీవల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన వైఖరిని ఆయన పునరుద్ఘాటించినట్టు అయింది. దిండిగల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మెరీనా బీచ్(Marina Beach) సర్వీసు రోడ్డులో గస్తీ తిరుగుతున్న పోలీసులపై పీకలదాకా తాగిన ఓ జంట విరుచుకుపడింది. అర్థరాత్రి పూట ఉండకూడదని, త్వరగా ఇంటికి వెళ్లమంటూ సలహా ఇచ్చిన పుణ్యానికి ఆ జంట పోలీసులను దుర్భాషలాడింది.
సమైక్యతకు భంగం కలిగించేలా, తమిళ తాయి గేయంలో కొన్ని పంక్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించి కోట్లాది తమిళ ప్రజల మనస్సులను గాయపరిచిన గవర్నర్ ఆర్ఎన్.రవిని తక్షణం రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(State Deputy Chief Minister Udayanidhi) ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో డ్రెస్ కోడ్ పాటించేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ దాఖలైంది.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్నిధి స్టాలిన్తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు..