Home » TMC
మొబైల్ యూజర్లకు వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉప క్రమించింది. వాట్సాప్లో వికసిత్ భారత్ పేరుతో మెసేజ్లను తక్షణమే ఆపాలని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలిదశలో 102 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాఖండ్లో బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్పై కమలం పార్టీ గురి పెట్టింది.
సీఏఏపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రాజుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని కొందరు వ్యతిరేకిస్తుండగా మరికొందరు స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయ నేతలు చేసిన కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గంలో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజతా మోండల్ బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ నుంచి సౌమిత్రా ఖాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్లో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగడంతో ప్రచారం మరింత హీటెక్కించనుందనే స్థానికులు అంటున్నారు.
'ఇండియా' కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మరో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి పశ్చిమబెంగాల్లోని 42 లోక్సభ స్థానాలకు 'సోలో'గా అభ్యర్థులను ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య 'మిత్రభేదం' తప్పేలా లేదు. బెంగాల్లోని బహరామ్పూర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను టీఎంసీ రంగంలోకి దింపింది.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఏకపక్షంగా 42 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ''ఎక్స్'' వేదికగా అన్నారు.
'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ లో పొత్తుల వ్యవహరంలో కాంగ్రెస్ పార్టీకి మొండిచేయి చూపింది. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగింది. 42 లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఆదివారంనాడు ప్రకటించారు.
సీఎం మమత బెనర్జీ తొలిసారిగా శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు రోజుగా ప్రకటించారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం పట్ల బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
Sourav Ganguly: ఇండియా క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కారు. ఆయన రాజకీయ భవిష్యతంపై జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో.. తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో(Mamata Banerjee) భేటీ అయ్యారు. నబన్నాలోని సీఎం మమతా బెనర్జీ ఆఫీస్కు వెళ్లి ఆమెను కలిశారు. దాదాపు అరగంట సేపు మమతా బెనర్జీతో సౌరవ్ గంగూలీ చర్చలు జరిపారు.
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు బుధవారం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. సందేశ్ ఖాళి లోక్ సభ నియోజకవర్గంలో గల బరాసత్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. సభకు భారీగా మహిళలు వచ్చారు.