Home » Thummala Nageswara Rao
ఏడాది కాలంలోనే రేవంత్ ప్రభుత్వం రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులను మరువబోమని చెప్పారు. తమ ప్రభుత్వం ఇంకా చాలా పథకాలు తీసుకురాబోతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్గాటించారు.
వానాకాలం పంటల సాగు కోసం రైతుభరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు పండుగ’ పేరుతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
కోతలు తప్ప చేతలు ఉండవు కాబట్టే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారని, ఆ విషయాన్ని వారు మర్చిపోయినట్లు ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
వ్యవసాయ యాంత్రీకరణకు 2025- 26 సంవత్సరానికి బడ్జెట్లో రూ. 104 కోట్ల కేటాయింపులు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీ కింద పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర శివార్లలోని మండలాల్లో రైతు భరోసా పంపిణీపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఈ 18 మండలాల్లో ఒక్క రైతు ఖాతాలో కూడా నిధులు జమ కాలేదు.
మహిళా సంఘాలకు త్వరలో 381 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ(గురువారం) ఖమ్మం కలెక్టరేట్లో ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
తాను ఉన్న మంత్రివర్గం ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు తుది నివేదిక రాలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ మంజూరు అంశమూ క్యాబినెట్ ముందుకు రాలేదని చెప్పారు.
రైతు భరోసాతో పాటుగా స్ర్పేయర్లు, టార్పాలిన్లు, రోటవేటర్లు వంటి వ్యవసాయ యంత్రాలు, డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి కోరారు.
వ్యవసాయ విశ్వవిదాలయ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎ.రేవంత్రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతులతో మాట్లాడనున్నారు.
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున ఈనెల 25లోపు రాష్ట్రంలోని సాగుచేసే రైతులందరికీ రైతుభరోసా అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.