Home » TGSRTC
టీజీఎస్ఆర్టీసీ.. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజ్లతో స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడుపుతోంది.ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో మహాజాతర జరగనుండగా భక్తులను తరలించేందుకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో సిటీ బస్సులు తగ్గాయి. దాదాపు 500 బస్సులను జిల్లాలకు తరలించారు. దీంతో నగరంలో సిటీబస్సులు తగ్గిపోయాయి. సంక్రాంతి పండుగ సెలవులు రావడం, శని, ఆదివారాలు కూడా పాఠశాలలకు సెలవులే కావడంతో చాలామంది ఇంకా ఊర్లల్లోనే ఉండిపోయారు. దీంతో నగరంలో బస్సులను తగ్గించారు.
మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరకు ఇంకా సమయం ఉన్నప్పటికీ భక్తులు ముందుగానే వెళుతుండడంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. జాతర కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. జాతర సమయంలో భక్తలు పెద్దసంఖ్యలో విచ్చేయనుండడంతో.. ముందుగానే వెళుతున్న భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు.
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దిల్సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది..
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ ఆరు వేల పైచిలుకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేనుంది. జనవరి 9 నుంచి 13వ తేదీల మధ్య, ఆపై జనవరి 18, 19 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో ఆయా ఏరియాల్లో ఈవీ బస్సులు నడుస్తున్నాయి. అయితే.. ఈ బస్సులకు చార్జింగ్ పెట్టుకునేందుకుగానూ ఈవీ డిపోలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్బీనగర్ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో నూతనంగా మరో వెయ్యి ఈవీ బస్సులను నడిపేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒక్క ఫిబ్రవరిలో 170 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి.. 2026 చివరి నాటికి మొత్తం వెయ్యి బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.