Home » TG Govt
అమరుల త్యాగాల పునాదులు మీద తెలంగాణ అవతరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల స్పూర్తిగా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనను అందిస్తున్నామని పేర్కొన్నారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శాసనసభ, శాసనమండలి ప్రాంగణాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై సీఐడీ చీఫ్ చారు సిన్హా ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భారీ నెట్వర్క్ కార్యకలాపాలను బట్టబయలు చేశారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం.. రైస్ మిల్లర్లతో కుమ్మకైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటానని సీఎం చెప్పారని..మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూన్ 1వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనల్లో భాగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
విద్యే అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనతో పాటు సమాజాన్ని జాగృతం చేసే శక్తి విద్యకే ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రెండేళ్ల కిందట మున్నేరు వరదలకు తీవ్ర నష్టం చవిచూశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకారంతో రూ. 690 కోట్లతో ప్రోటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆనలేదని తేల్చిచెప్పారు.