Home » TG Govt
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు కుమారుడు వెంకట్పై కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటి విషయంలో బెదిరింపులకు దిగారని బాధితుడు వెంకట్ తన ఫిర్యాదులో తెలిపారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రాష్ట్ర రాజకీయాలపై పూర్తి దృష్టి సారించారు. పీఈసీ జూమ్ సమావేశం, అవార్డు కార్యక్రమం, జిల్లాల పర్యటనలు, ఎన్నికల ప్రచార సభలతో ఆయన షెడ్యూల్ పూర్తిగా బిజీగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం చేపడుతున్న ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా, వద్దా అని ప్రశ్నించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను.. సిట్ సుమారు నాలుగున్నర గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.