Home » TG Govt
బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘటనా స్థలానికి చేరుకోవడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూల్డ్రింక్లో పురుగుల మందు ఉన్న విషయం తెలియని నాగరాజు దానిని తాగడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని పేర్కొన్నారు.
మాజీమంత్రి కేటీఆర్కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాతమని కేటీఆర్ తెలిపారు. సంతోషంగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని పేర్కొన్నారు.
భార్య అలివేలు, వదిన హనుమమ్మ, కూతురు శ్రావణిలను యాదయ్య కొడవలితో గొంతుకోసి హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో కూతురు అపర్ణ యాదయ్య నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి కేటీఆర్.. తన సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం మేలు చేస్తారు..? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. శనివారం కెనడా హైకమిషనర్తో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులకి సంబంధించిన పలు కీలక విషయాలపై కెనడా ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి చర్చించారు.
వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.