Home » TG Govt
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..
తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ సంస్థలో అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా లంచాలు తీసుకున్న వ్యవహారం బయటపడటంతో 8 మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది..
హైదరాబాద్ పంజాగుట్టలో హైడ్రా మరోసారి తన మార్క్ చూపించింది. చట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన మెట్ల మార్గాన్ని అధికారులు ఇవాళ తెరిపించారు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీలో మార్పులు జరిగాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి..
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంపై తెలంగాణ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జీవో నంబర్ 55ను సవాల్ చేస్తూ కోర్టులో గురువారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు..
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు. L1 కింద 4,800 మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.
భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ని పరిశుభ్రంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.