Home » TG Govt
హైదరాబాద్లో అధ్యాపక సభని శనివారం నిర్వహించాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో FATHI లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటీషన్పై జస్టీస్ శ్రవణ్ కుమార్ విచారణ జరిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వమే అనేక విద్యాసంస్థలను నెలకొల్పిందని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నిర్ణయాలతోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గ్రోత్ ఇంజన్గా ఉందని పేర్కొన్నారు సీఎం రేవంత్రెడ్డి.
మాగంటి గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్రెడ్డిల మధ్య గొడవలు మొదలయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిపాస్తుల కోసమే వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆక్షేపించారు. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్లిద్దరూ పంచుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్ కుమార్.
దేశంలో వీధి కుక్కల సమస్యలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసుపై ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.
రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరి హైదరాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లో దందా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరాన్ని సూరి గ్యాంగ్ అడ్డాగా మార్చుకున్నట్లు తెలిపారు.
సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరిగా రేవంత్ వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సిటీలో మళ్లీ తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్నేనని విమర్శించారు. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి తాము శ్రీకారం చుట్టామని నొక్కిచెప్పారు కేటీఆర్.
బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి మాజీ సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్రెడ్డి .
తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి(32) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు రక్షించడానికి ప్రయత్నం చేయగా.. అప్పటికే మీన్రెడ్డి మృతి చెందాడు.
తనను, పిల్లల్ని చూసుకోవడం లేదని, అలాగే తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వడం లేదని ఓ భార్య, భర్తను కిడ్నాప్ చేయించింది. సుమారు పది మందితో కలిసి భర్త కిడ్నాప్కు ప్లాన్ చేసింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..