Home » TG Govt
నీట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పునర్నిర్వహిస్తున్న ఈ పరీక్షలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు, ఒత్తిళ్లకు గురికాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించారు
పాడి రైతుకు భరోసా కల్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. విజయ డెయిరీకి ప్రభుత్వ అండగా ఉంటుందని మాటిచ్చారు. 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు.
తెలంగాణ జాతిపిత జయశంకర్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కీర్తించారు.
వీబీజీ రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖ రాశామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నూతన చట్టాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని.. పనిగట్టుకుని తమను కొందరు బద్నాం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఉండాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవ్వరూ కలలో ఊహించి ఉండరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు.
రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎల్ఐసీకి రూ.1,359.56 కోట్ల వార్షిక ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపారు.
ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రా తీసుకువచ్చామని ప్రస్తావించారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం ట్రస్ట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈహెచ్ఎస్ అమలుకు కొత్త బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఏర్పాటు చేస్తూ జీఓ నంబర్-40 విడుదల చేసింది.
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు వేయాలని సూచించారు.