Home » TG Govt
ఆక్షన్లో పాల్గొంటున్న వారిపై నౌహీరా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నౌహీరా చర్యలపై ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్పై రేవంత్రెడ్డి సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రెట్టింపు లబ్ధి చేకూరుస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో ఓవర్సీస్ విద్యా నిధి కింద లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
డిపార్ట్మెంట్లో లంచం తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్తో పాటు టెక్నాలజీని వాడాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.
తనకు కష్టకాంలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనని రెండుసార్లు ఓడించారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ఈ విధానం ద్వారా అదానీ కంపెనీలకు అధిక లాభం కలగనుందని బీవీ రాఘవులు ఆరోపించారు. విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రైమరీ స్కూల్ కమిటీకి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం, యూపీఎస్ కమిటీకి స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా ఉంటారు. మరో ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిలిపివేసింది.
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.