Home » TG Govt
తెలంగాణ రవాణా శాఖ పనితీరును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు కేంద్ర మంత్రి అభినందనలు తెలిపారు. మంత్రి పొన్న ప్రభాకర్ని ప్రశంసిస్తూ నితిన్ గడ్గరీ గురువారం లేఖ రాశారు.
రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
ధాన్యం రవాణాపై తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వరి ధాన్యం తరలింపునకు వాహనాలను సమీకరించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రవాణా అధికారులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది.
భాగ్యనగరంలో మహిళల భద్రతపై పోలీసు శాఖ కీలక చర్యలు చేపడుతోంది. నగర మహిళా పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్లోకి దిగి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సంచలనంగా మారింది.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. మే 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, గృహనిర్మాణశాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా రైతులపై ఎరువుల భారం పడుతోంది. ధరలు మరింత పెరగడంతో అన్నదాతలు దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ఒకే సారి పంట మద్దతు ధర పెంచుతున్నాయి.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.