Home » Telangana Politics
బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల లిస్ట్ మొత్తం వచ్చేసింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి.
ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్నగర్(Mahabubnagar), నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupathanna) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. ఏడు రోజుల పాటు ప్రణీత రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.
Open Heart With RK-Revanth Reddy: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన వ్యక్తిగత వివరాల గురించి కీలక వివరాల చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన వ్యక్తిగత అభిరుచుల గురించి వెల్లడించారు.
MLC Kavitha: తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత(Kavitha) అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam Case) కేసులో ఈడీ అదుపులో ఉన్న కవిత.. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తనపై కావాలని తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇది నకిలీ కేసు అని, పొలిటికల్ కుట్ర అని ఆరోపించారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం లోక్ సభ స్థానంపై టెన్షన్ నెలకొంది. ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన భార్య నందినికి ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తెలంగాణకు వచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో మోదీ పాల్గొంటున్నారు. కాసేపట్లో సభా వేదికపైకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. మరోవైపు పార్టీలో సీనియర్ నేతలు బీఆర్ఎస్ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వరుస ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. ఈ ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత కేసుకు సంబంధించిన వాదనలు విన్న సీబీఐ (CBI) స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ తదుపరి విచారణ మధ్యాహ్ననికి వాయిదా వేశారు. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి.