Home » Telangana High Court
Telangana: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో నిందితులుగా చేర్చడంపై పుష్ప నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. మైత్రి మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తమ ప్రమేయం లేదని.. కేసును కొట్టేయాలని నిర్మాతలు కోరారు.
కూల్చివేతలు చేపట్టిన ల్యాండ్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం. ఆధారాలు ఉన్నాయా? అని హైడ్రాను నిలదీసింది. పిటిషనర్ వద్ద అన్ని డాక్యూమెంట్స్ ఉన్నాయి కదా? అని హైడ్రాను...
Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను హైకోర్టు పొడిగించింది. ఈనెల 31 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.
Telangana: గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై హైకోర్టును గ్రూప్-1 అభ్యర్థులు ఆశ్రయించారు. వారి పిటిషన్పై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇప్పటికే గ్రూప్-1పరీక్షలు పూర్తి అయ్యాయి.
Telangana: ఫార్ములా ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేటీఆర్ తరపున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఏసీబీ కేసు నమోదు చేశారని న్యాయవాది సుందరం కోర్టుకు తెలిపారు.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును మాజీ మంత్రి ఆశ్రయించారు.
Telangana: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
Telangana: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో రాజ్ పాకాల.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. మరోవైపు రాజ్ పాకాల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయనకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.
కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది.