Home » Telangana Govt
Telangana: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
Telangana: రైతు నేస్తం పేరుతో ప్రతి రైతులతో నేరుగా మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ సరికొత్త ప్రోగ్రాంకు నాంది పలికింది. రియల్ టైం సొల్యూషన్స్ త్రు డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రాజెక్టును వ్యవసాయ శాఖ రూపొందించింది. శాస్త్రవేత్తలు, అధికారులను అనుసంధానం చేసే విధంగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు.
Telangana: ఎల్ఆర్ఎస్పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
Telangana: గొర్రెల పథకం నిధుల గోల్మాల్పై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. గొర్రెలు,ఆవులు, బర్రెల స్కీంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ ల్యాబ్లో డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
తనను కావాలనే కొంతమంది టార్గెట్ చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చేస్తోందన్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారన్నారు. హెచ్ఎండీఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజ్కి రోడ్డు వేశామన్నారు.
రైతులకు త్వరలో తీపి కబురు చెప్పబోతున్నామని, వారికిచ్చిన హామీ అమల్లో భాగంగా రూ.2 లక్షల రుణ మాఫీపై బ్యాంకర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.