Home » Tej Pratap yadav
తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్స్టాగ్రామ్లో జేజేడీ అధికార ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ గత మేలో ఒక మహిళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఫేస్బుక్ పోస్టులో వెల్లడించడంతో ఆర్జేడీలో కలకలం రేగింది. దీంతో ఆయనను పార్టీ నుంచి ఆర్జేడీ బహిష్కరించింది.
తేజ్ ప్రతాప్ యాదవ్పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.
బిహార్ సర్వతోముఖాభివృద్ధికి అంతికతమవుతూ, అందుకు సిద్ధంగా ఉన్నట్టు తేజ్ప్రతాప్ తెలిపారు. బిహార్లో మార్పును తీసుకువచ్చేందుకు కొత్త సిస్టమ్ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని తెలిపారు.
వికాస్ వంచిత్ ఇన్సాన్ పార్టీ (వీవీఐపీ), భోజ్పురియ జన్ మోర్చా (బీజేఎం), ప్రగతిశీల్ జనతా పార్టీ (పీజేపీ), వజిబ్ అధికార్ పార్టీ (డబ్ల్యూఏపీ), సంయుక్త్ కిసాన్ వికాస్ పార్టీ (ఎస్కేవీపీ)లతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు తేజ్ప్రతాప్ ప్రకటించారు.
తేజ్ ప్రతాప్ గత నెలలో తన ఫేస్బుక్ అకౌంట్లో అనుష్క యాదవ్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. 12 ఏళ్లుగా తమ మధ్య రిలేషన్ షిప్ ఉందని ప్రకటించారు. ఇంతవరకూ చెప్పడానికి సంకోచించానని, ఇప్పుడు అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
తన గర్ల్ఫ్రెండ్ అనుష్క యాదవ్, తానూ పన్నెండేళ్లుగా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, చాలాకాలంగా ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నప్పటికీ అదెలాగో తెలియలేదనీ పేర్కొంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు.
తేజ్ ప్రతాప్ తన పోస్ట్లో దురాశాపరులైన జైచంద్ వంటి వారిని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఉంటున్న వారే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తనకు తల్లిదండ్రులే సర్వస్వమని తెలియజేశారు.
రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసినా ఆ విషయం దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. తనను కొట్టి, వేధింపులకు పాల్పడినప్పుడు, గృహహింస చేసినప్పుడు లాలూ చెబుతున్న సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు.
తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడం, ఆయనపై ఇతర వివాదాలు కూడా ఉండటంతో లాలూ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.