Home » Tadipatri
ఐదునెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సత్యసాయి నీటి పథకం కార్మికులు చేపట్టిన స మ్మె గురువారం కొనసాగింది. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వారు రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ సత్యసాయిబాబా నీటి పథకాన్ని జిల్లా పరిషతకు అప్పగించవద్దని, ట్రస్ట్ ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నారాయణపల్లిలో రూ.57లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి, కొండేపల్లిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి బుధవా రం ఆమె భూమిపూజ చేశారు.
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన స్థానిక ఆదర్శపాఠశాలలోని 16మంది విద్యార్థులకు సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ ఓబులరెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన నారాయణస్వామి నగదు బహుమతులు అందజేశారు.
పట్టణంలోని పోలీస్స్టేషన తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి బుధవారం రాత్రి పర్య టించారు. ఆయన ప్రజలతో మాట్లాడుతూ పట్టణంలో ఏమైనా సమస్య లు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
మండలంలోని తిమ్మన చెరువు లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా ఈనెల 30న అంగ రంగ వైభవంగా తిరుణాలను నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం దేవస్థానాన్ని పరిశీలించి అర్చకులు, ఆలయ కమిటీ వారితో మాట్లాడారు. తిరుణాల ప్రత్యేకంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని తెలిపారు.
ప్రజా సమస్యలను తె లుసుకుని పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని టైలర్స్కాలనీ, శివానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
గ్రామాల్లో ఎలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అధి కారులకు సూచించారు. ఆయన శనివారం పట్టణం లోని తన నివా సంలో యాడికి మండలం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో తాగునీరు, విద్యుత, డ్రైనేజీ వంటి సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థతో గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం ఎంతో బలోపేతమైందని ఎంపీడీవో వీ ర్రాజు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్క రిం చుకొని శుక్రవారం యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు
అధికారులు నిర్లక్ష్యం వీడి మంచి పరిపాలన అందించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించా రు. పట్టణంలోని తమ నివాసంలో ఆయన మున్సిపల్, సచివాలయం తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
మా బండి. మా ఇష్టం అనే రీతిలో మండలంలో కొందరు ద్విచక్రవాహనదారులు వ్యవహరిస్తున్నారు. రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు నంబర్ ప్లేట్లు అమర్చుకుంటున్నారు. ప్లేట్ ఉంటుంది కానీ కొన్నింటిపై నంబర్ ఉండదు.