Home » Student
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా మీ మేథస్సుతో పని చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మార్గనిర్దేశం చేశారు. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తోందని.. వాటిపై మనం పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన సాంకేతికతను ఉపయోగించి మంచి పంటలు పండేలా చేయాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో మంగళవారం కీలక విచారణ కొనసాగుతోంది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
అర్థం కాని చదువుతో సతమతం అవుతున్నానని, ఈ చదువు తనతోకాదని, చెల్లినైనా నచ్చిన కోర్సులో జాయిన్ చేయించి మంచిగా చదవించండంటూ తల్లిదండుల్రకు సూసైడ్ నోట్ రాసి ఇంటర్ విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ప్రముఖ బౌద్ధ సంస్థ బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (బీఎల్ఐఏ) మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్ నగరం కవాడిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే పేద పిల్లలకు బూట్లు, ఇండోర్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసింది.
Goa Trip With Lovers: ముగ్గురికి ప్రియురాళ్లు ఉన్నారు. ప్రియురాళ్లతో కలిసి గోవా వెళ్లాలని, అక్కడ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, లవర్స్తో కలిసి గోవా వెళ్లేంత డబ్బుులు వీరి దగ్గర లేదు.
సైబర్ సెక్యూరిటీ - సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రొగ్రామ్ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్లైన్లో అందిస్తున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ - పంచాయతీరాజ్‘(ఎన్ఐఆర్డీపీఆర్)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్(పీజీడీటీడీఎమ్), ప్రోగ్రామ్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్నారు.
ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ‘మ్యాట్ 2025’ సెప్టెంబర్ సీజన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్ల్లో ‘ద మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్’(మ్యాట్) ఒకటి. ఈ ఎంట్రెన్స్ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు.
‘ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ - 2026’ నోటిఫికేషన్ను ఢిల్లీలోని ‘ద నేషనల్ లా యూనివర్సిటీ’ విడుదల చేసింది. ఐదు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ లా(బీఏ ఎల్ఎల్బీ)(ఆనర్స్), ఒక సంవత్సరం మాస్టర్ ఆఫ్ లా(ఎల్ఎల్ఎం) ప్రోగ్రామ్లకు సంబంధించిన ఈ ఎంట్రెన్స్ పరీక్ష 2025 డిసెంబర్ 14న జరుగుతుంది.
దేశంలో మొదటిసారిగా, సమగ్రంగా కులగణన చేపట్టామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. పేద బతుకులు మారాలంటే విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, బాగా చదివి తెలంగాణ, దేశ అభివృద్ధిలో భాగం అవ్వాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు.