Home » Srisailam
శ్రీశైలంలో సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఉచిత దర్శనం, స్పర్శ దర్శనాలను కల్పించారు.
జూలై నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతూ ఆల్మట్టి, జూరాల జలాశయాలు దాటి శ్రీశైలంలోకి వస్తోంది
ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది.
కృష్ణమ్మ బిర బిరా పరుగులు పెడుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు బుధవారం 70 వేల క్యూసెక్కుల వరద రాగా.. గేట్ల ద్వారా 27 వేలు, జలవిద్యుత్తు ఉత్పాదనతో 42 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ప్రియదర్శిని జూరాల రిజర్వాయర్కు నిలకడగా వరద కొనసాగుతున్నదని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. జలాశయంలో 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీశైలం దేవస్థానం క్యాషియర్ బీ. శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ మంజనాథ్ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించడంతో ఈ చర్యలు చేపట్టారు.
తోకచుక్క అనగానే చాలా మందికి ఠక్కున గుర్తొచ్చే పేరు.. హేలీ తోకచుక్క! తోకచుక్కల గురించి చెప్పడానికి ప్రముఖంగా దీని గురించే చెబుతారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంటుందిది.
శ్రీశైలంలో డ్యాం నిర్మాణానికి జరిగిన నష్టాన్ని పుణే శాస్త్రవేత్తలు అత్యాధునిక వీడియో కేమెరాలతో విశ్లేషిస్తున్నారు. దీనివల్ల నష్టానికి పూర్తి అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేపట్టడం సులభమవుతుంది.
వానాకాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. వనపర్తి, గద్వాల జిల్లాల సరిహద్దులోని జూరాల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మే నెలలోనే వరద వచ్చింది.