Home » Srikakulam
ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తరువాత మారిన రాజకీయ సమీకరణలతో ఆమె వైసీపీలో చేరారు
YSR Congress: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) ముందు వైసీపీకి (YSRCP) ఊహించని షాక్ తగిలింది. టికెట్లు రాలేదని కొందరు.. పార్టీకి సేవలు చేసినప్పటికీ గుర్తించలేదని మరికొందరు అధికార పార్టీకి రాజీనామాలు చేసేస్తున్నారు...
Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ (TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ(YCP) ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేస్తుంది.
AP Elections 2024: స్పీకర్ తమ్మినేని సీతారామ్కు (Speaker Tammineni Sitharam) ఈసారి ఎన్నికల్లో సొంతపార్టీ (వైసీపీ) (YSR Congress) నుంచే ఎదురుదాడి తగులుతోంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ఒక్కచాన్స్ కారణంగా..
ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటి శ్రీకాకుళం. గ్రామీణ వాతావరణం ఎక్కువుగా ఉండే ఈ జిల్లాలో ఇప్పటికీ వెనుకబాటు తనం ఎక్కువే. ఇంకా సరైన రహదారులు లేని గ్రామాలు శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో కనిపిస్తుంటాయి.
అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శ్రీకాకుళం జిల్లా: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఓ చారిత్రాత్మక ఘట్టమని, ఈ కలయిక పార్టీల కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసమని, తమ నాయకుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నేత కూనరవికుమార్ అన్నారు.
శ్రీకాకుళం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారం చేపడతాయని, వైసీపీ కుక్కలు, సీఎం జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. దేశంలో పొత్తులు కొత్త కాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.