Home » Srikakulam
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారితమని, జిల్లా ప్రజలకు సాగునీటి భద్రత కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వంశధార నీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాను సస్యశ్యామలం చేయాలని పూనుకున్నట్లు ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి.
హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై 91 తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది.
శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష మూలపేట పోర్టు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నవంబర్ నాటికి పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మందస మండలం బి.కేసుపురంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబాన్ని ఊరి నుంచి సామాజిక బహిష్కరణ చేశారు. ఆ కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దని, వారిని పనులకు, శుభకార్యాలకు పిలవకూడదని దండోరా వేయించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందని ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయిని కూర్మాన అరుణకుమారిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆధునిక విద్యా విధానంలో మార్పులు తెస్తూ, విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్లో గల రాధాకృష్ణుల ఆలయం హోలీ జాతరకు ముస్తాబయింది. ఆదివాసీలు ప్రతీ ఏడాది హోలీకి ముందు రోజు నుంచి స్థానిక రాధాకృష్ణుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
జిల్లాలో నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం. ఆర్మీ నియామకానికి సంబంధించి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఏప్రిల్1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్లో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు.